Friday, April 19, 2024

102 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

- Advertisement -
- Advertisement -

BSE
ముంబయి: ఈక్విటీ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 102 పాయింట్లు పతనమైంది. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఐటిసి, మారుతి, ఇన్ఫోసిస్ షేర్లు మార్కెట్‌ను పతనావస్థకు లాగాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల బిఎస్‌ఇ సూచీ(సెన్సెక్స్) 101.88 పాయింట్లు లేక 0.17 శాతం పడిపోయి 60821.62 వద్ద స్థిరపడింది. కాగా నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజికి చెందిన నిఫ్టీ50 దాదాపు 63.20 పాయింట్లు లేక 0.35 శాతం పతనమై 18114.90 వద్ద స్థిరపడింది.

లాభపడిన షేర్లలో హెచ్ డి ఎఫ్ సి, బజాజ్ ఆటో, ఓ ఎన్ జి సి, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, నష్టపోయిన షేర్లలో హిందాల్కో, ఐటిసి, టాటా కన్స్ ష్ట్ర క్ష న్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News