- Advertisement -
ముంబై: ప్రపంచ క్రికెట్లో ఐపిఎల్ అత్యంత జనాదారణ కలిగిన లీగ్గా కొనసాగుతుందని ముంబై స్టార్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్కప్ ఫైనల్ తర్వాత అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరిచేది ఒక్క ఐపిఎల్ తుది సమరంపైనే అంటే ఎలాంటి అతిశయోక్తి లేదన్నాడు. కరోనా నేపథ్యంలో ఈసారి ఈ మెగా టోర్నీని యూఎఇలో నిర్వహించాల్సి వచ్చిందని, ప్రతికూల వాతావరణంలోనూ అభిమానులు ఐపిఎల్కు బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తం చేశాడు. ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకున్నా టివిల్లో కోట్లాది మంది ఐపిఎల్ను వీక్షించారని, దీంతో తాము మరింత ఉత్సాహంతో ఆడేందుకు ఇది దోహదం చేసిందన్నాడు. ఐపిఎల్ ఫైనల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారన్నాడు. వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ల తర్వాత ఒక్క ఐపిఎల్ ఫైనల్కే ఇలాంటి ఆదరణ లభిస్తుందని పొలార్డ్ పేర్కొన్నాడు.
- Advertisement -