Monday, May 13, 2024

994 సింగరేణి క్వార్టర్లను ప్రారంభించిన మంత్రులు కెటిఆర్, ఎర్రబెల్లి, సత్యవతి

- Advertisement -
- Advertisement -

 

జయశంకర్ భూపాలపల్లి: మంజూరు నగర్ లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కార్మికుల సౌకర్యార్థం రూ.229 కోట్లతో నిర్మించిన 994 క్వార్టర్లను మంత్రులు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కెటి రామారావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదన చారి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, సింగరేణి ఎం.డి. శ్రీధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ డిఎస్ దివాకర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News