Saturday, July 27, 2024

కారును ఢీకొట్టిన ట్రక్కు: ఆరుగురి మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో : ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలో లక్నోకాన్పూర్ జాతీయ రహదారిపై ఆదివారం ట్రక్కు వేగంగా దూసుకొచ్చి కారును ఢీకొనడంతో రోడ్డుపై నడిచివెళ్తున్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. కారులో నలుగురైదుగురు చిక్కుకు పోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. క్రేన్ సహాయంతో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శశి శేఖర్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News