Friday, April 26, 2024

కుంగిన భూమి…. గుంతలో పడిన బస్సు… ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

dead

 

బీజింగ్: చైనాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా మరో పది మంది ఆచూకీ లభించలేదు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చైనాలోని గ్జీనింగ్ నగరంలో ఓ బస్టాప్‌లో బస్సు ఆగిన వెంటనే భూమి కుంగిపోయింది. దీంతో  వెంటనే బస్సు గుంతలోకి వెళ్లడంతో వాహనం నుంచి మంటలు వచ్చాయి. అక్కడ ఉన్న ప్రయణికులు పరుగులు తీశారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ దృశ్యాలు అక్కడ ఉన్న సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి.  రెస్య్కూ సిబ్బంది క్రేన్ సహాయంతో బస్సును గుంతలో నుంచి బయటకు తీశారు. గాయపడిన 16 మందిని ఆస్పత్రికి తరలించారు. గతంలో చైనాలో షెంజెస్ పారిశ్రామిక వాడలో గుంతలో వాహనం పడి ఐదుగురు చనిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News