Friday, April 19, 2024

సంక్షేమ పథకాల అమల్లో ఉద్యోగుల పాత్ర కీలకం

- Advertisement -
- Advertisement -

Somesh Kumar

 

హైదరాబాద్ : సంక్షేమ పథకాల అమల్లో ఉద్యోగులు పాత్ర కీలకమని, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను టిఎన్జీఓ నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎస్ సోమేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాల అమల్లో బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సిఎస్‌ను కలిసిన వారిలో టిఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, అసోసియేట్ అధ్యక్షురాలు బండారు రేచల్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇటికాల కొండల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కార్యదర్శి బద్దం బుచ్చిరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కిషన్, భాగ్యనగర్ టిఎన్జీఓ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Somesh Kumar met with TNGO leaders
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News