Tuesday, May 7, 2024

10 ప్రత్యేక రైళ్లు ఈనెలాఖరు వరకు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 10 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్- టు తిరుపతి (07482) రైలు డిసెంబర్ 4-25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి- టు సికింద్రాబాద్ (07481) రైలు డిసెంబర్ 3-31 వరకు ప్రతి ఆదివారం, హైదరాబాద్- టు నర్సాపూర్ (07631) రైలు డిసెంబర్ 2-3వ తేదీ వరకు ప్రతి శనివారం నడుస్తుందని అధికారులు పేర్కొన్నారు.

నర్సాపూర్- టు హైదరాబాద్ (07632) రైలు డిసెంబర్ -31వ తేదీ వరకు ప్రతి ఆదివారం, కాకినాడ- టు లింగంపల్లి (07445) రైలు డిసెంబరు 1-29 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, లింగంపల్లి- టు కాకినాడ (07446) రైలు డిసెంబర్ 2-3వ తేదీ వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. తిరుపతి టు -అకోలా, పూర్ణ- టు తిరుపతి మధ్య రెండు జతల ప్రత్యేక రైళ్లు తిరుగుతాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News