Thursday, June 19, 2025

రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి: నారా లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రపంచస్థాయి శిక్షణ, సౌకర్యాల కల్పన స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వివిధ కీడల్లో అథ్లెట్లకు మద్దతు లక్ష్యమని అన్నారు. రెండో రోజు డిల్లీలో లోకేశ్ పర్యటించారు. టోనీ బ్లేయర్ తో ముందు కేంద్ర కార్మికశాఖ మంత్రి మాండవీయతో సమావేశమయ్యారు. విద్యారంగంలో అభివృద్ధి కోసం ‘టోనీ బ్లేయర్ ఇన్ స్టిట్యూట్ సహకారం కోరారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ (Sports City Amaravati) నిర్మాణానికి సహకారం అందించాలని, ఎపిని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు  శరవేగంగా కొనసాగుతున్నాయని లోకేష్ తెలియజేశారు.

ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి, రాష్ట్రంలోని పాఠశాలలు, క్రీడల అభివృద్ధికి చేయూత అందించాలని, 39 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని కోరారు. క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు ప్రతిపాదనలు జరగుతున్నాయని, రూ. 341.57 కోట్లతో ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలు ఆమోదించాలని సూచించారు. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజినల్ సెంటర్ ఏర్పాటుకు వినతి చేశారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్ ను తిరుపతిలో నెలకొల్పాలని నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News