Saturday, April 27, 2024

తిరుపతిలో ‘శ్రీకారం’ పూర్తి

- Advertisement -
- Advertisement -

Sreekaram movie shooting is completed

 

ఇటీవల తిరుపతిలో ప్రారంభమైన ‘శ్రీకారం’ షూటింగ్ తాజాగా పూర్తయింది. శర్వానంద్, ప్రియాంక అరుల్ మోహన్, నరేష్, రావు రమేష్, సాయి కుమార్, సత్య, సప్తగిరి, ఆమని ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. టాకీపార్ట్‌తో పాటు దినేష్ మాస్టర్ నేతృత్వంలో ఒక సాంగ్ చిత్రీకరణ జరిగింది. శర్వానంద్ జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోన్న ఈ సినిమాకు కిషోర్.బి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్టర్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News