Saturday, April 20, 2024

బిల్కిస్ బానో కేసు విచారణకు సుప్రీం కీలక నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడానికి సుప్రీం కోర్టు బుధవారం నిర్ణయించింది. 2000 గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై , ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బిల్కిస్ బానో ఈ కేసులో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా, సుప్రీం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

అత్యాచార కేసులో 11 మంది దోషులను గడువుకు ముందే బీజేపీ సారథ్యం లోని గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15 న విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో బిల్కిస్ బానో సవాలు చేశారు. సుప్రీం కోర్టు నిర్దేశించిన చట్టపరమైన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్షం చేసి , యాంత్రికంగా దోషుల విడుదలకు ఆదేశాలిచ్చిందని తన పిటిషన్‌లో బిల్కిస్ బానో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. యావజ్జీవ శిక్ష పడిన దోషులను ముందుగా విడిచిపెట్టడం తప్పుడు సంకేతాలకు తావిచ్చిందన్నారు.

గోవా రైలును ఆందోళనకారులు తగులబెట్టిన తరువాత చెలరేగిన అల్లర్లలో బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. అప్పట్లో 21 ఏళ్ల వయస్సున్న ఆమె ఐదు నెలల గర్భవతి కూడా. బిల్కిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో మూడేళ్ల ఆమె కూతురు కూడా ఉంది. ఈ కేసును సిబిఐ చేపట్టగా, తదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీం కోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

ఈ తీర్పును ఆ తర్వాత ముంబై హైకోర్టు, సుప్రీం కోర్టు ధ్రువీకరించాయి. జైలులో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్‌జైలు నుంచి గత ఏడాది ఆగస్టు 15న వీరంతా విడుదలయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News