Saturday, April 20, 2024

వాహనాలు తనిఖీ చేస్తుండగా కాల్పులు: ఇన్‌స్పెక్టర్ మృతి

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: కేరళ- తమిళనాడు సరిహద్దులో దారుణం వెలుగులోకి వచ్చింది. కన్యాకుమారి జిల్లాలోని పదంతాలుముడు చెక్‌పోస్ట్ దగ్గర దుండగులు కాల్పులు జరపడంతో ఇన్‌స్పెక్టర్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కలియక్కవిల సమీపంలో ఇన్‌స్పెక్టర్ విల్సన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా దుండగులు కారులో వచ్చి కాల్పులు జరిపి పారిపోయారని స్థానిక ఎస్‌ఐ పి స్వర్ణ లత తెలిపారు. వెంటనే ఇన్‌స్పెక్టర్ ను  స్థానిక ఆస్పత్రికి తరలించాము కానీ అప్పటికే అతడు చనిపోయాడని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మూడు బుల్లెట్టు దేహంలోకి దూసుకెళ్లడంతో పోలీస్ అధికారి మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. దుండగులు టిఎస్ 57 ఎడబ్ల్యు 1559 మహేంద్ర స్కార్పియో కారులో వచ్చి కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. కన్యాకుమారి ఎస్‌పి ఎన్ శ్రీనాథ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Tamilnadu Inspector Wilson Shot Dead by Assailants,
Gunning the officer down assailants escaped in car, vehicle registration number is TN 57AW 1559

 

Tamilnadu Inspector Wilson Shot Dead by Assailants
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News