బర్మింగ్హామ్: ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 15 పరుగుల వద్ద కెఎల్ రాహుల్(2) ఔటయ్యాడు. తర్వాత వన్డౌన్లో వచ్చిన కరుణ్ నాయర్తో కలిసి మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్(87) ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇద్దరు కుదురుగా ఆడడంతో భారత్ కోలుకుంది. ఇటు యశస్వి.. అటు నాయర్ ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు నడిపించారు.
కరణ్ నాయర్(31) పెవిలియన్ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్(25) నిరాశపర్చాడు. ఆ వెంటనే నితీష్ కుమార్ రెడ్డి(1) కూడా ఔట్ కావడంతో భారత్ కొంత ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ తో జట్టును ఆదుకున్నాడు. తొలి రోజు సెంచరీ బాది జట్టును కష్టాల్లోంచి బయట పడేశాడు. రెండో రోజ జడేజాతో ఇన్నింగ్స ప్రారంభించిన గిల్..సెంచరీని డబుల్ సెంచరీగా మలిచాడు. 311 పరుగులు ఎదుర్కొన్న గిల్ మొత్తం 21 ఫోర్లు, 2 సిక్సులతో 200 పరుగులు సాధించాడు. దీంతో ఇంగ్లండ్ లో డబుల్ సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్ మెన్ గా గిల్ రికార్డు నెలకొల్పాడు. గిల్ అద్భుత డబుల్ సెంచరీతోపాటు జడేజా కూడా 89 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో రాణించారు. దీంతో 151 ఓవర్లలో భారత్ 287 పరుగులకు ఆలౌటైంది.