Thursday, April 25, 2024

ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ జట్టు నిర్దేశించిన 287 పరుగులు లక్ష్యాన్ని 47.3 ఓవర్లో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 289 పరుగులు చేసి భారత్ గెలుపొందింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. గతేడాది ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా ప్రతికారం తీర్చుకుంది. టీమిండియా స్టార్ ఓపెనర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(119) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ(89), శ్రేయస్ అయ్యర్(44)లు రాణించారు.

Team India Win 3rd ODI Against Australia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News