Thursday, April 25, 2024

అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం సిఎం కెసిఆర్‌దే: కవిత

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు, చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎంఎల్‌సి కవిత తెలిపారు.డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేక వ్యక్తులు, శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సిఎం కెసిఆర్ కార్మికుల మంచి కోరే వ్యక్తిగా కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా ప్రతి నెల ఉద్యోగులను తీసుకుంటున్నారని ఎంఎల్‌సి కవిత అన్నారు. ఇప్ప టిదాక దాదాపు 15వేల వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా కూతుళ్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల కెసిఆర్ ఉన్న గొప్ప మనసును తెలియజేస్తుందన్నారు.

ఎంఎల్‌సి కవిత, కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ. 10లక్షలను తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ. 25లక్షలకు పెంచామని ఎంఎల్‌సి కవిత గుర్తు చేశారు. ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 సంవత్సరాలకు పెంచుకోవడం సంతోషకరమన్నారు. కార్మికులకు సౌకర్యవంతంగా పని చేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి క్వార్టర్స్‌కు ఉచిత విద్యుత్‌తో పాటు, ఏసి ఏర్పాటుచేసే సౌకర్యాలు కల్పించడం, ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం, మహిళా కార్మికులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి ఏరియా ఆసుపత్రులలో తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం, ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు అందించడం,

సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీజు రియాంబర్స్‌మెంట్ ఇవ్వడం, సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని ఎంఎల్‌సి కవిత తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజుతో పాటు, మరో రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించి సిఎం కెసిఆర్ అంబేద్కర్ పట్ల ఉన్న గొప్ప ప్రేమను మరోసారి చాటుకున్నారని అన్నారు. అమ్మ లాంటి సింగరేణి సంస్థను సిఎం కెసిఆర్ కాపాడి, విస్తరించి ఇతర రాష్ట్రాలకు సైతం సోలార్, థర్మల్ పవర్‌ప్లాంట్‌లను అధనంగా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, సంస్థను లాభాల బాట పట్టించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే తెలంగాణ బిడ్డ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే సాధ్యమయ్యిందని గర్వంగా చెబుతున్నానన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News