Friday, March 29, 2024

రైల్వే శాఖలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: బోయినపల్లి వినోద్‌కుమార్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినోద్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 3.12 లక్షల ఉద్యోగాలతో పాటు దక్షిణమధ్య రైల్వేలోని కీలక విభాగాల్లో 30 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇతర విభాగాల్లో ఇంకా అనేక ఖాళీలు ఉన్నాయని వినోద్‌కుమార్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాసిన లేఖలో పేర్కొన్నారు. రైల్వే శాఖలో ఉద్యోగాల ఖాళీల వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిపై పనిఒత్తిడి పెరుగుతోందని, దీనివల్ల పలు ప్రమాదాలు, అనర్థాలకు దారితీస్తోందని వినోద్‌కుమార్ అన్నారు.

రైల్వే శాఖలో సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులు, సరుకుల రవాణా ద్వారా అధిక ఆదాయం సమకూరుస్తూ కీలక పాత్ర పోషిస్తోందని వినోద్‌కుమార్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు కొంతభాగం కర్ణాటక, మహారాష్ట్రల్లో సౌత్ సెంట్రల్ రైల్వే సేవలు అందిస్తోంద న్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో కీలకమైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, టికెట్ కలెక్టర్స్, స్టేషన్ మాస్టర్స్, లోకో మోటివ్ పైలట్స్, ట్రాక్ మెంటెనర్స్, టెక్నికల్ స్టాఫ్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. నిరంతరంగా రైల్వే ట్రాక్స్‌ను , సిగ్నల్స్ లైటింగ్స్‌ను పర్యవేక్షించేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు చోటు కలుగుతోందని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

చాలీ చాలని ఉద్యోగులు ఉన్న ప్రస్తుత తరుణంలో, ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని, దీంతో వారు మానసికంగా కృంగిపోతున్నారని వినోద్ కుమార్ తెలిపారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరంతరం వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని, ఉద్యో గులకు ఇన్సెంటివ్‌లు ఇచ్చి ప్రోత్సహించాలని, రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినివైష్ణవ్‌కు రాసిన లేఖలో వినోద్‌కుమార్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News