Friday, July 11, 2025

తెనాలిలో యువకుడిని వెంటాడి నరికిచంపిన దుండగులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో గురువారం ఉదయం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాండురంగపేటలో ప్రశాంత్‌ను దుండగులు నరికి చంపారు. దుండగులు ముఖానికి మాస్కులు పెట్టుకొని వచ్చి ప్రశాంత్‌ను నరికారు. పాతకక్షలే రౌడీషీటర్ ప్రశాంత్ హత్యకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: ప్రతిపక్షాలన్నీ ఏకమైతే బిజెపి ఓడిపోతుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News