Tuesday, April 30, 2024

గిరిజన క్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: ముఖ్యమంత్రి కెసిఆర్ నిమిత్తంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన జీవితాల్లో వెలుగులు నింపుతుందన్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ క్యాంపు కార్యాలయంలో అనంతగిరి మండలానికి చెందిన గిరిజనులకు గిరిజన కార్పొరేషన్ ద్వారా మ ంజూరైన 47.65 లక్షల విలువగల చెక్కులను 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… లబ్ధిదారులందరూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకొని వ్యాపారంలో రాణిస్తేనే అందిస్తున్న సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని గిరిజనుల ఆర్థికంగా బలపడాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్షంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. దశాబ్థాలుగా అణచివేతకు, వెనుకబాటుకు గురైన గిరిజనులు ఆత్మ గౌరవంతో బతికేలా చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. గిరిజనుల సంక్షేమంతో పాటు అభివృద్ధికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం జరిగిందని ఆయన అన్నారు. నేడు గిరిజనులు విద్యాధికులై ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణిస్తున్నారు అని ఆయన తెలిపారు.

తండాలను గ్రామపంచాయతీలుగా గుర్తించి గిరిజనులకు రాజ్యాధికారంలో కీలక భాగస్వామ్యం చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని ఆయన తెలిపారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు ఉద్యోగ, ఉపాధి, విద్య, క్రీడలు తదితర రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గిరిజనులు అన్ని రంగాలల్లో ఎదగాలని అన్నారు. గిరిజన సంక్షేమం కోసం దోహదపడుతున్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వెన్నుదన్నుగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయ, మండల పార్టీ అధ్యక్షులు గింజుపల్లి రమేష్, సర్పంచ్‌ల పోరం అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి యాకోబ్, ఎస్టీసెల్ అధ్యక్షులు గుగులోతు శ్రీనివాస్‌నాయక్, బొజ్జగూడెం తండా సర్పంచ్ వెంకటేశ్వర్లు, పాలారం తండా సర్పంచ్ శ్రీనుబాబు, నాయకులు బానోతు ప్రసాద్, శంకర్, రవి, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News