Thursday, March 28, 2024

పెట్రోల్ బంక్‌లో ప్రమాదం.. ముగ్గురు మృతి

- Advertisement -
electric-shock
గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట మండలం గ్రామం రామచంద్రపురంలో శనివారం విషాదఛాయలు అలుముకున్నాయి. పెట్రోల్ బంక్ లో జరిగిన విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులో విద్యుత్ బల్బులు పనిచేయకపోవడంతో, సిబ్బంది ఓ ఇనుప స్టాండ్ సహాయంతో బల్బు మార్చడానికి ప్రయత్నించే సమయంలో స్టాండ్ 11 కెవి లైన్ కు తగలడంతో ముగ్గురు వ్యక్తులు విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీప దవాఖానకు తరలించారు. అతను చికిత్స పొందుతూ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. మృతులను బొప్పూడి, పోలిరెడ్డిపాలెం గ్రామస్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Three died due to electric shock at Guntur district
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News