Friday, April 26, 2024

ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురు కూలీలు మృతి

- Advertisement -
- Advertisement -

tractor rollover

కృష్ణా: ట్రాక్టర్‌ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కృష్ణాజిల్లాలోని నందిగామ మండలం జొన్నలగడ్డ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో 12 మంది కూలీలకు తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే నందిగామ సర్కార్ దవాఖానకు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. మృతులను పెనుగంచిప్రోలు మండలం గుమ్మిడిదల వాసులుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కూలీల మృతితో గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Three Laborers Died in Road Accident At Krishna District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News