- Advertisement -
న్యూఢిల్లీ: భారత్లో చిన్న వ్యాపారుల కోసం ఒక బిలియన్ డాలర్లు (రూ.7,100 కోట్లు) పెట్టుబడులు పెట్టడం వల్ల భారత్కు పెద్దగా ఒరిగేదేమీ లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోష్ ప్రకటన చేసిన మరుసటి రోజు ఆయన విధంగా స్పందించారు. ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ వ్యాపారులకు పెద్దమొత్తంలో నష్టాలను ఎలా కల్గిస్తుంది? ధరల తగ్గింపు ఇతర సంస్థలకు ఎలా నష్టం కల్గిస్తుంది? అనే అంశాన్ని ప్రస్తా వించారు. ఇకామర్స్ సంస్థలు భారతీయ నిబంధనలను పాటించాలని అన్నారు. మల్టీ బ్రాండ్ రిటైలింగ్లో విదేశీ పెట్టుబడులు 49 శాతానికి మించి ఉండడాన్ని భారత్ అనుమతించబోదని, ఈ దిశగా ఏ విదేశీ రిటైలర్లకు అనుమతివ్వలేదని ఆయన అన్నారు.
Amazon not doing a favour by investing $1 billion
- Advertisement -