- Advertisement -
గద్వాల: ఆగి ఉన్న ట్రాక్టర్ను కారు ఢీకొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని దెయ్యల వాగు వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న చెరుకు లోడు ట్రాక్టర్ను అతివేగంగా వచ్చి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Three Members Dead in Car Collided to Tractor
- Advertisement -