Tuesday, April 30, 2024

ఇంటి ముందు కట్టేసిన ఆవును చంపిన పులి

- Advertisement -
- Advertisement -

బొండపల్లి: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెంలో ఆదివారం తెల్లవారుజామున పులి కలకలం రేపింది. ఇంటి ముందు కట్టేసిన ఓ ఆవును పులి చంపి తినేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు హుటాముటిన ఘటనాస్థలికి చేరుకుని పులి అడుగులను పరిశీలిస్తున్నారు. పులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News