Thursday, May 2, 2024

యూకో బ్యాంకులో రూ.20 లక్షలు గల్లంతు

- Advertisement -
- Advertisement -

అమరావతి: కృష్ణా జిల్లాలోని యుకో బ్యాంకులో రూ. 20లక్షలు గల్లంతయ్యాయి. 2021లో భార్య అకౌంట్ లో మచిలీపట్నం వాసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశాడు. తాజాగా డబ్బు విత్ డ్రా కోసం దంపతులు బ్యాంకుకు వెళ్లారు. దీంతో వారికి బ్యాంకు వాళ్లు చెప్పిన విషయం విని దిమ్మతిరిగింది. 2022లో 4 విడతలుగా డబ్బు విత్ డ్రా అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో బాధితుడు బాలచంద్ర పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News