Thursday, May 2, 2024

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేయండి : సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హర్యానాలో చెలరేగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ), బజరంగ్ దళ్ మద్దతుదారులు ఢిల్లీలో నిరసనలు చేపడుతుండటంపై అధికార యంత్రాంగానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి, సీసీటీవీలతో గట్టి నిఘా ఉంచాలని సూచించింది. ఈ నిరసనల్లో ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. హర్యానా లో హింస చెలరేగడంతో దేశ రాజధాని నగరం లోని సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే పోలీస్‌లు భద్రతను కట్టుదిట్టం చేశారు.

హర్యానా లోని మేవాట్‌లో జరిగిన ఘర్షణలను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ శ్రేణులు దేశ రాజధాని నగరం ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 30 చోట్ల నిరసనలు చేపడుతున్నారు. హర్యానాలో చెలరేగిన ఘర్షణల్లో ఇప్పటివరకు ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీలపై స్టే విధించాలంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.

ఈ నిరసనల్లో ఎలాంటి హింస గానీ, విద్వేష ప్రసంగాలు గానీ లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సుప్రీం కోర్టు ఆదేశించింది. అందుకోసం పారామిలిటరీ బలగాలతో సహా తగిన భద్రతా సిబ్బందిని మోహరించాలని సూచించింది. అంతేకాకుండా నిరసనలను రికార్డు చేసేలా తగినన్ని సిసిటీవీలు సైతం అమర్చాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News