Saturday, April 27, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అధిక సంఖ్యలె భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తరలిస్తున్నారు. దీంతో వెంకన్న సర్వదర్శనానికి సోమవారం 21 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. భక్తులు తమ తలనీలాలు సమర్పించి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ఆదివారం శ్రీవారిని 72,256 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,021మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారం హుండీ ఆదాయం రూ.3.04 కోట్లు వచ్చినట్లు టిటిడి వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News