Sunday, June 16, 2024

తిరుమల వెంకన్న దర్శనానికి 20 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.  తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్ని నిండి బయట వరకు క్యూ లైనులో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు.

బుధవారం శ్రీవారిని 80,048 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 35,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News