Sunday, June 16, 2024

నిర్మల్ లో బస్సు బోల్తా పడి ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. సారంగాపూర్ మండలం రాణాపూర్ వద్ద అర్థరాత్రి ముస్కాన్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో..కరు మృతి చెందారు. మరో 32 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి పరిశీలించారు.

క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News