Tuesday, April 23, 2024

వినియోగదారులకు శుభవార్త.. రూ.130 చెల్లిస్తే 200 ఛానెల్స్

- Advertisement -
- Advertisement -

TRAI

 

బిజినెస్ : కేబుల్ ఛార్జీలను భారీగా తగ్గించింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI. కొత్త సంవత్సరం రోజున  కేబుల్ టివి వినియోగదారులకు ట్రాయ్ ఈ శుభవార్త చెప్పింది. సవరణలతో కొత్త టారిఫ్‌ను ప్రకటించింది. మార్చి 1 నుంచి ఈ కొత్త టారిఫ్ అమలులోకి రానుంది. గతంలో రూ.130 + 18శాతం జీఎస్టీ కలిపి రూ.154 చెల్లించినవారికి 100 ఛానెల్స్ ఉచితంగా వచ్చేవి. అదనంగా ప్రతీ 25 ఛానెళ్లకు రూ.20 చెల్లించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం జిఎస్టీతో కలిపి రూ.154 చెల్లించిన వారికి 200 ఛానెల్స్ లభించనున్నాయి. వీటితో పాటు 26 దూరదర్శన్ ఛానెల్స్‌ అదనంగా చూడొచ్చు. అంతేకాదు ఒకే ఇంట్లో రెండు టీవీలు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్వర్క్ కెపాసిటీ ఫీజులో గరిష్టంగా 40% చెల్లిస్తే చాలు.

ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ సబ్‌స్క్రిప్షన్స్ తీసుకునేవారికి డిస్కౌంట్లు కూడా ఇవ్వొచ్చని డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్లకు అనుమతి ఇచ్చింది ట్రాయ్. మరోవైపు బ్రాడ్‌క్యాస్టర్లు అందించే ఛానెళ్ల బొకేలో ఒక ఛానెల్ ధర గరిష్టంగా రూ.12 మాత్రమే ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. బ్రాడ్‌క్యాస్టర్లు రివైజ్ చేసిన అలా కార్టే టారిఫ్‌ను 2020 జనవరి 15 లోగా తమతమ వెబ్‌సైట్లలో పబ్లిష్ చేయాలని కోరింది. గతేడాది ట్రాయ్ కొత్త టారిఫ్ అమలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో యూజర్లపై భారం పడింది.

ట్రాయ్ పైన విమర్శలు కూడా వచ్చాయి. వినియోగదారులకు ఛానెళ్లను ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చేందుకే కొత్త టారిఫ్ అమలు చేశామని ట్రాయ్ చెప్పినా… చివరికొచ్చేసరికి కొత్త టారిఫ్ విధానం భారంగా మారింది. దీంతో ట్రాయ్ పలు సవరణలు చేస్తోంది. అందులో భాగంగానే రూ.130 చెల్లించేవారికి 200 ఛానెల్స్ ఇవ్వాలని ఆదేశించింది. మార్చి 1 నుంచి రూ.130+జిఎస్టీ చెల్లించే కేబుల్ టివి యూజర్లు 200 ఛానెల్స్ చూడొచ్చు. అన్ని ఫ్రీ టూ ఎయిర్ ఛానెల్స్ చూడాలనుకునేవారు గరిష్టంగా రూ.160 చెల్లిస్తే చాలు.

TRAI has greatly reduced cable charges
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News