Thursday, May 2, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ .. మొక్కలు నాటిన టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం వద్ద మొక్కలు నాటారు.   ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి మాట్లాడారు.  సిఎం కెసిఆర్ హరితహారం స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ఎంపి సంతోష్ కుమార్ కి సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించిన పుట్టినరోజు, పెళ్లి రోజు, ఇతర శుభకార్యాలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంప్రదాయంగా మారిందన్నారు. హరిత హారం, గ్రీన్ ఇండియ చాలెంజ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందని ప్రశంసించారు. పచ్చదనం పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని సతీస్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News