Saturday, April 27, 2024

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు, మరణాలు..

- Advertisement -
- Advertisement -

37593 New Corona Cases Reported in India

న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా కేసులతోపాటు మరణాలు మళ్లీ పెరిగుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,92,755మందికి పరీక్షలు నిర్వహించగా.. 37,593 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. కరోనా బారినపడి 648మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 34,169మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. తాజా  కేసులతో మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 3,25,12,366కు పెరగింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 4,35,758మంది బాధితులు మరణించారు. దేశవ్యాప్తంగా కరోనా నుంచి  ఇప్పటివరకు 3,17,54,281మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,22,327 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 97.67శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

37593 New Corona Cases Reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News