- Advertisement -
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఆస్పత్రిలో గర్భవతికి సిజేరియన్ నిర్వహించగా.. కవల శిశువులు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నర్సులతో ఆపరేషన్ చేయించారని వాళ్లు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -