హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అరుదైన బహుమతి అందించింది. చలి నుంచి తట్టుకునేందుకు ధరించే స్పెట్టర్ను ట్విట్టర్ సంస్థ మంత్రి కెటిఆర్కు గిఫ్ట్గా పంపించింది. జాకెట్కు ఓ వైపు కెటిఆర్ టిఆర్ఎస్ అనే అక్షరాలు మరో వైపు ట్విట్టర్ పక్షి చిహ్నంతో ఉంది. కెటిఆర్ ట్విట్టర్ మాధ్యమం ద్వారా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటున్న విషయం తెలిసిందే. ప్రజల నుంచి ఫిర్యాదులను, సమస్యలను, సలహాలను అందుకుంటారు. వాటికి సరైన సమాధానాలు, పరిష్కారాలు కూడా వెనువెంటనే అందజేస్తారు. రాష్ట్ర ప్రజలు తమ పరిధిలోనూ, పరిసర ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను, ఇబ్బందులను ప్రజలు ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ పరిష్కారాలు పొందుతున్నారు.
ఇటీవల కెటిఆర్ ప్రజలకు నిర్ణీత సమయం కేటాయించి మరీ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ఆదేశించారు. పేదవారి ఆరోగ్య, ఆపరేషన్ అవసరాలను కూడా కెటిఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా పలుమార్లు తెలుసుకుని ఆర్థికసాయం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తమ మాధ్యమం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమాజహితం, ప్రజాసంక్షేమానికి పాటుపడుతున్న సందర్భంగా కెటిఆర్కు ట్విట్టర్ ఈ బహుమతి పంపించింది.