Sunday, April 28, 2024

జమ్ముకశ్మీర్ లో ఎన్​కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

 

శ్రీనగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్ అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు అనుమానిత ఉగ్రవాదులు రహస్యంగా భారత్ లోకి చొరబడి సైనికులపై దాడి చేశారు. సైనికులు అప్రమత్తమై ఉగ్రవాదులపై ఎదరు కాల్పులు జరిపారని తెలిపారు.కొందరు అనుమానిత ఉగ్రవాదులను గుర్తించామని, సైనికులు ఎన్​కౌంటర్ ని కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.

Two Army jawans martyred in Nowshera encounter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News