Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

- Advertisement -
- Advertisement -

Accident

ఖమ్మం: జిల్లాలోని పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఐదుగరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సమచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి పంపిచారు. క్షతగాత్రులను చికిత్స కోసం స్థానిక సర్కార్ దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతన్నారు. మృతులు రాజమండ్రికి చెందిన హేమంత్‌ రెడ్డి, సూరి రెడ్డిగా పోలీసులు గుర్తించారు. కర్నాటక నుండి రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Two Died Five Injured in Road Accident At Khammam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News