Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Two Injured in Road Accident At Quthbullapur

కుత్బుల్లాపూర్‌: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు చింతల్ నుండి శాపూర్ నగర్ వైపు వెళ్తూండగా అదుపుతప్పిన బజాజ్ ప్లాటినమ్ బైక్ స్కిడ్ అయ్యి డివైడర్ ను ఢీకొట్టంది. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం ఎహ్.ఎమ్.టి కంపెనీ వద్ద జరిగింది. సందీప్ పరిస్దితి విషమంగా ఉందని గాంధీ వైద్యులు తెలిపారు. వీరిద్దరు శాపూర్ నగర్ లోని ఇండస్ట్రియల్ క్యాంటీన్ లో పనిచేసుకుంటూ అక్కడే ఉంటున్నారు. గాయపడిన వారిని సందీప్, షోబన్ లుగా గుర్తించారు. బట్టలు కొనుక్కోవడానికి చింతల్ వచ్చి రిటర్న్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Two Injured in Road Accident At Quthbullapur

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News