- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో సృష్టిస్తున్న 199 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతిచెందినట్లు తెలిపింది. తాజా కేసుల్లో రాష్ట్రంలోని 130 మందికి, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 69 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు వైద్యులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,718 చేరుకుంది. ఇక, కరోనాతో మరణించినవారి సంఖ్య 75కు పెరిగింది. ఇప్పటివరకు కరోనా నుంచి 2,353 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 1,290 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
199 New Corona Cases Reported in AP
- Advertisement -