Monday, May 20, 2024

25 మంది ఉద్యోగులను తొలగించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బుధవారం అనారోగ్య కారణంతో సెలవు పెట్టిన 25 మంది ఉద్యోగులను తొలగించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కష్టాల్లో మంగళవారం రాత్రి నుంచి విమానయాన సంస్థకు చెందిన దాదాపు 90 విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్‌లోని చాలా మంది క్యాబిన్ సిబ్బంది అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లడంతో ఈ సమస్య వచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ వ్యక్తులు ఎయిర్‌లైన్ యాజమాన్యం వివక్షకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సమస్యపై పౌర విమానయాన శాఖ సీరియస్ అయింది. అంతేకాదు దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశిస్తూ, సమస్యలను పరిష్కరించి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించింది.

క్షమాపణ.. ఫ్లైట్ రద్దు పూర్తి వాపసు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలను ఆకస్మికంగా రద్దు చేసినందుకు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. వాట్సాప్‌లో ప్రయాణీకులు తమ రద్దు చేసిన విమానాలకు గానూ పూర్తి వాపసు పొందవచ్చని ఎయిర్‌లైన్ తెలిపింది. ఇది కాకుండా వారు కోరుకుంటే, ఉచితంగా రీషెడ్యూల్ కూడా చేస్తామని కంపెనీ ప్రకటించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News