Saturday, April 27, 2024

వారం రోజుల్లోనే వైసిపికి గుడ్బై చెప్పిన అంబటి రాయుడు..

- Advertisement -
- Advertisement -

ఎపిలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. శనివారం వైసిపికి మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్బై చెప్పారు. పార్టీలో చేరిన వారం రోజులకే అంబటి రాయుడు వైసిపిని వీడడంతో చర్చనీయాంశంగా మారింది.

గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రాయుడు వైసిపీలో చేరిన విషయం తెలిసిందే. ఇంతలోనే వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా రాయుడు ప్రకటించారు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. అందుకే తాను వైసిపిని వీడుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News