Wednesday, April 24, 2024

వాసాలమర్రిలో అనుమానాస్పద ఆత్మహత్యలు

- Advertisement -
- Advertisement -

ఉరి వేసుకొని మహిళ, కడుపు నొప్పి బరించలేక యువకుడు బలవన్మరణం

 

మనతెలంగాణ/తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని వాసాలమర్రి గ్రామంలో మహిళ, యువకుడు అనుమానస్పదంగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వాసాలమర్రి గ్రామానికి చెందని మెరుగు మాధవి (25) సోమవారం ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో సరిగ్గా మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి భర్త, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

పెట్రోల్ పోసుకొని యువకుడు బలవన్మరణం…

మండలంలోని వాసాలమర్రి గ్రామానికి చెందిన మెరుగు రాజు (25) డ్రైవర్ వృత్తి చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా కడుపు నొప్పి తీవ్రం కావడంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో కడుపు నొప్పి బరించలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు. మృతుల ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. వాసాలమర్రి గ్రామంలో ఓకేరోజు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Two Members Suicide in Vasalamarri Village
Two Members Suicide in Vasalamarri Village

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News