Friday, May 3, 2024

ఐదేళ్ల చిన్నారిపై గ్యాంగ్‌రేప్‌: దోషులను నిర్దారించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

Delhi Court

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అత్యంత దారుణంగా ఐదేళ్ల చిన్నారి గుడియాపై జరిగిన గ్యాంగ్‌రేప్‌ కేసులో ఢిల్లీ కోర్టు ఇద్దరిని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెల్లడించింది. శనివారం ఈ కేసును విచారించిన కోర్టు జనవరి 30వ తేదీన దోషులకు శిక్ష ఖరారు చేయనుంది. అదనపు సేషన్స్ జడ్జీ నరేష్ కుమార్ మల్హోత్ర ఈ కేసులో మనోజ్‌కుమార్‌, ప్రదీప్‌లను దోషులుగా తేల్చారు.  2013 ఏప్రిల్‌ 15న ఢిల్లీలోని గాంధీనగర్‌ ప్రాంతంలో దోషులు మనోజ్‌కుమార్‌, ప్రదీప్‌లు ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి  పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో స్పృహ తప్పిన చిన్నారిని మనోజ్ రూమ్‌లోనే వదిలేసి పరారయ్యారు. నలభై గంటల తర్వాత చుట్టుప్రక్కల వారు గమనించి సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులకు చిన్నారిని ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్‌ వైద్యులు చిన్నారికి మెరుగైన చికిత్సతోపాటు పలు సర్జరీలు నిర్వహించిన తర్వాత చిన్నారి కోలుకుంది.

Two men convicted for raping 5 year old girl in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News