Friday, April 19, 2024

తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపితో పొత్తు చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రశాసననగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామన్నారు.

ఇక నుంచి నెలలో కొన్ని రోజుల పాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాల కోసం సమయాన్ని కేటాయిస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. బిజెపితో పొత్తు గురించి మాట్లాడుతూ.. లోతైన చర్చలు జరిగిన తరువాతనే తెలుగు రాష్ట్రాలు, ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత కొన్ని నెలలుగా పొత్తుపై బిజెపి అగ్రనాయకత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయని చెప్పారు.

We will strengthen Janasena in Telangana: Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News