Thursday, May 2, 2024

కరీంనగర్ జిల్లాలో విషాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. కోనేరులో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతిచెందారు. జమ్మికుంట మండలం బిజిగిర్ షరేఫ్ వద్ద కోనేరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గోదావరిఖని చెందిన శ్రీనాథ్(19), సాయికుమార్ (24)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News