Sunday, April 28, 2024

ఇది చరిత్రాత్మక దినం:అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటూ మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేయడం దేశప్రజాస్వామ్య వ్యవస్థకు‘ ఒక చరిత్రాత్మక దినం’గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అభివర్ణించారు.‘ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక చరిత్రాత్మక దినం. ‘ఒక దేశం ఒకే ఎన్నికల’పై రామ్‌నాథ్ కోవింద్‌జీ అధ్యక్షతన మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ రోజు గౌరవ రాష్ట్రపతి ముందుంచింది’ అని అమిత్ షా ఎక్స్( ట్విట్టర్)లో ఉంచిన పోస్టులో పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News