Sunday, April 28, 2024

టిడిపి-బిజెపి-జెఎస్పీ కూటమికి విజయసాయిరెడ్డి సవాల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హామీ ఇవ్వాలని టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సవాల్‌ విసిరారు.

త్రైపాక్షిక కూటమికి సవాల్ విసిరేందుకు రాజ్యసభ సభ్యుడు ఆదివారం ‘ఎక్స్‌’లో సంచలన కామెంట్స్ చేశారు. ఆ మూడు పార్టీలు ఎపి ప్రగతి కంటే తమ పొత్తునే ఎక్కువగా దృష్టి పెట్టాయని విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి పాటుపడే పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. నెల్లూరు లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్నారు.

మే 13న రాష్ట్రంలోని 175 మంది అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీజేపీ, పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 151 అసెంబ్లీ స్థానాల్లో భారీ మెజారిటీతో టీడీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. 25 లోక్‌సభ స్థానాలకు గానూ 22 స్థానాలను కైవసం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News