Saturday, April 27, 2024

ఎపిలో విషాదం.. గ్రామ సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

అనంతపురం: జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. గ్రామ సచివాలయ ఉద్యోగిని నందిని(22) ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసకుంది. ఇటీవల గ్రామ సచివాలయం పోస్ట్ కు ఎంపికైన నందిని జిల్లాలోని కనేకల్ పంచాయతీలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో నందిని ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో సంచలనంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, నందిని ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Village Secretariat employee suicide in Anantapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News