Friday, May 3, 2024

ఉక్రెయిన్‌లో భారతీయుల క్షేమానికే ప్రాధాన్యత

- Advertisement -
- Advertisement -
welfare of Indians in Ukraine is paramount
తక్షణం వారిని ఖాళీ చేయించే ఉద్దేశం లేదు
విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడి

న్యూఢిల్లీ: యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఉక్రెయిన్‌లోని భారతీయులను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయించే ఆలోచన లేదని, అంతకంటే కూడా వారు సురక్షితంగా ఉండేలా చూడడంపైనే తాము దృష్టి పెడుతున్నామని విదేశాంగ శాఖ గురువారం స్పష్టం చేసింది. ఉక్రెయిన్ విషయంలో నెలకొన్న ఉద్రిక్తతలను తక్షణం తగ్గించే చర్యలకు భారత్ మద్దతు ఇస్తుందని, నిరంతర దౌత్య చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం మీడియాకు చెప్పారు. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులతో కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం టచ్‌లో ఉందని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం గమనిస్తూనే ఉంటుందని ఆయన చెప్పారు.

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి కారణంగా తాత్కాలికంగా ఉక్రెయిన్‌ను వదిలి వెళ్లాలని అక్కడి భారత ఎంబసీ మంగళవారం భారత పౌరులకు ముఖ్యంగా విద్యార్థులకు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు దేశంలోపల అనవసర ప్రయాణాలు మానుకోవాలని కూడా సలహా ఇచ్చింది. అయితే ఉక్రెయిన్‌లోని భారత పౌరులు, భారతీయ విద్యార్థులు క్షేమంగా ఉండేలా చూడడమే తమ తొలి ప్రాధాన్యత అని బాగ్చీ సష్టం చేశారు. వారిని వెంటనే ఖాళీ చేయించే ఉద్దేశం లేదని, ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయడం లేదని కూడా ఆయన చెప్పారు. ఎయిర్ బబుల్ ఏర్పాటు కింద ఉక్రెయిన్, భారత్ మధ్య పరిమిత సంఖ్యలోనే విమానాలు ఉన్నాయని బాగ్చీ గుర్తు చేస్తూ, అయితే ప్రస్తుతం విమానాల సంఖ్య, ప్రయాణికుల సంఖ్యపై పరిమితి ఎత్తివేస్తున్నట్లు ఆయన చెప్పారు.అంతేకాదు చార్టర్ విమానాలను నడపాల్సిందిగా విమాన యాన సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News