Saturday, July 27, 2024

బిజెపి నేత రఘనందన్ నుంచి ప్రాణహాని

- Advertisement -
- Advertisement -

Woman

మన తెలంగాణ/పంజగుట్ట : బిజెపి నేత, న్యాయవాది రఘునందన్ రావు తనపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని రాధా రమణి అనే మహిళ అరోపణలు చేసింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మా ట్లాడారు. రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధి జ్యోతినగర్‌కు చెందిన తాను 2003లో తన భర్త పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపింది. 2012లో రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌లో రఘునందన్‌రావు చేస్తున్న అఘాయిత్యాలను గురించి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయింది.

తాను ఎక్కడ ఫిర్యాదు చేసినా సిఐ రాజశేఖర్ రెడ్డి ,న్యాయవాది రఘనందన్ రావులు కేసులు కాకుండా అడ్డుపడేవారని అరోపించింది. సిఐ రాజశేఖర్ రెడ్డి తాను ఫిర్యాదు చేయడానికి వెళితే తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డాడని వాపోయింది. రఘునందన్ రావు నుంచి తనతో పాటు తన కుమారుడికి ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సిపి సజ్జనార్‌ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఆయన పోలీసులను కేసు నమోదు చేయాలని సూచించారని, దీంతో రఘునందన్‌పై కేసు నమోదు చేశారని ఆమె వెల్లడించింది.

Woman Alleges Rape by BJP Leader Raghunandan Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News