పుదుచ్చేరి: ప్రసవం కోసం గర్భిణి ఆస్పత్రికి వెళ్తే కడుపులో దూది ఉండ పెట్టి కుట్లేసి ప్రాణాలు తీసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కుడలోర్ జ్లిలా వ్రిధచాలామ్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. ప్రియా (26) అనే గర్భిణి ప్రసవం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. సదరు మహిళాకు ప్రభుత్వాసత్రిలో ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశారు. కానీ ఆపరేషన్ చేసిన అనంతరం దూది ఉండను కడుపులో పెట్టి కుట్లు వేశారు. డిసెంబర్ 31 నుంచి సదరు మహిళకు కడపు నొప్పి ఎక్కువగా ఉండడంతో మళ్లీ ఆస్పత్రిలో వైద్యులను కలిసింది. ఆమె పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె స్కానింగ్ చేస్తే కడుపులో కాటన్ ఉన్నట్టు గుర్తించారు. కడుపులో ఉన్న దూది ఉండతో ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. ప్రియా మృతదేహంతో ఆమె భర్త రాజ్ కుమార్, బంధువులు వ్రిధచాలమ్ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై జిల్లా వైద్య ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.