Thursday, May 2, 2024

రోజుకు 15వేల ధరణి సమస్యలకు పరిష్కారం

- Advertisement -
- Advertisement -

స్పెషల్ డ్రైవ్‌తో ధరణి భూసమస్యలు కొలిక్కి

ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం
చిత్తశుద్ధితో కృషి చేస్తున్న అధికారులు

రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : స్పెషల్ డ్రైవ్ తో ధరణి భూసమస్యలు కొలిక్కి వస్తున్నాయని, ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం లభించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గత ప్ర భుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పో ర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కు టుంబం ధరణితో సమస్యలను ఎదుర్కొంటుందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వచ్చిన 2,46, 536 లక్షల దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఈ నెల 1వ తేదీ నుంచి తహసీల్దార్ స్థా యిలో స్పె షల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామ ని, ఈ స్పెషల్ డ్రైవ్ లో 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో 76,382 ధరఖాస్తులను పరిష్కరించామని ఆయన తెలిపారు. రోజుకు 15వేలకు పై గా దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా పెండింగ్ మ్యూటేషన్‌లకు సంబంధించి 15,070 దరఖాస్తులకు 5,471 పరిష్కరించామని, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ 40,605 దరఖాస్తులకు గాను 17, 372, పాస్ బుక్ డేటా కలెక్షన్‌కు సంబంధించి 1,01,132 దరఖాస్తులకు గాను 27,047 ద రఖాస్తులను పరిష్కరించినట్టు ఆయన తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించి 27,672 దరఖాస్తులకు గాను 9,883 పరిష్కరించామన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా పెం డింగ్ లో ఉన్న భూసమస్యలను అధికారుల సిబ్బంది పరిష్కరించడంపై మంత్రి వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలని మం త్రి అభిలాషించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News