Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 17,135 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

1627 New Corona Cases Reported in AP

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 4.64 లక్షల మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 17,135 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 47 మంది మృతి చెందారని కేంద్రారోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.40 కోట్లకు చేరుకోగా 5.26 లక్షల మంది చనిపోయారు. కరోనా నుంచి 4.33 కోట్ల మంది కోలుకోగా 1.37 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 204.84 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాలలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News